అయ్యారే.. అయ్యర్..

     Written by : smtv Desk | Sat, Apr 28, 2018, 10:29 AM

అయ్యారే.. అయ్యర్..

ఢిల్లీ, ఏప్రిల్ 28 : సొంత గడ్డపై ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ టోర్నీ లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తో జరిగిన మ్యాచ్ లో 55 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వరుస పరాజయాల వెక్కిరించిగా నాయకత్వ భాద్యతలు నుండి గంభీర్ వైదోలగగా.. కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ (93 నాటౌట్‌; 40 బంతుల్లో 3×4, 10×6) కోల్‌కతా జట్టుపై జూలు విదిల్చాడు.


టాస్ నెగ్గిన కేకేఆర్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టులో కెప్టెన్ అయ్యర్ ఆటే హైలైట్. చివరి 50 పరుగులు చేయడానికి అతను తీసుకున్న బంతులు 13 మాత్రమే. మరో వైపు యువ ఆటగాడు పృథ్వీ షా (62; 44 బంతుల్లో 7×4, 2×6) మెరుపులు మెరిపించాడు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా జట్టులో ఆండ్రి రసెల్‌ (44) , శుభ మాన్ గిల్ (37), ఉన్నంత సేపు గెలుపు వైపు అడుగులేసింది. కానీ ఈ భాగస్వామ్యం విడిపోగానే కోల్‌కతా వడివడిగా ఓటమి వైపు జారుకుంది. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో అమిత్‌ మిశ్రా (2/23), మాక్స్‌వెల్‌ (2/22), అవేశ్‌ ఖాన్‌ (2/29) రాణించారు. అయ్యరే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్' అవార్డు దక్కింది.





Untitled Document
Advertisements