'లుంగి ఎంగిడి' ఈజ్ బ్యాక్..!

     Written by : smtv Desk | Sat, Apr 28, 2018, 02:10 PM

'లుంగి ఎంగిడి' ఈజ్ బ్యాక్..!

ముంబై, ఏప్రిల్ 28 : ఐపీఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానాలకు శుభవార్త. తండ్రి మరణంతో లీగ్ కు దూరమైనా సఫారీ పేసర్ లుంగి ఎంగిడి తిరిగి జట్టులో చేరినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 13 న తండ్రి జీరోమ్‌ మరణం కారణంగా ఎంగిడి దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. ఆ తర్వాత అతను మొత్తం ఈ మెగా టోర్నీ నుండి వైదొలిగినట్లు వార్తలు వచ్చాయి.


తాజాగా అతడు తిరిగి జట్టులో వచ్చినట్లు సమాచారం. పుణెలోని మైదానంలో అతడు ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. టోర్నీలో భాగంగా ఈ రోజు ముంబయి ఇండియన్స్‌ - చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. పుణెలో ఈ మ్యాచ్‌ జరగనుంది.





Untitled Document
Advertisements