పుణె, మే 1 : ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ హవా కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి తర్వాత పుంజుకొన్న ఆ జట్టు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో డిల్లీ డేర్డెవిల్స్ పై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తంగా ఆరో విజయం సాధించిన ధోనీసేన.. పాయింట్ల పట్టికలో తిరిగి ప్రథమ స్థానానికి దూసుకెళ్లింది.
తొలుత టాస్ నెగ్గిన ఢిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ ప్రత్యర్ధికి బ్యాటింగ్ అప్పగించాడు. బ్యాటింగ్ కు దిగిన జట్టులో వాట్సన్ (78), ధోని (51 నాటౌట్), అంబటి రాయుడు (41) వీరవిహారం చేయడంతో మొదట చెన్నై 4 వికెట్లకు 211 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 5 వికెట్లకు 198 పరుగులే చేయగలిగింది. డేర్ డెవిల్స్ జట్టులో (79) పోరాడిన జట్టును గెలిపించాలేకపోయాడు. చివరిలో విజయ్ శంకర్ (54 నాటౌట్) చెలరేగిన అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' షేన్ వాట్సన్ కు దక్కింది.