ఢిల్లీ, మే 2: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన మిత్రులతో కలిసి సేదతీరారు. 'జన్ ఆక్రోశ్' ర్యాలీలో పాల్గొని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన అలిసిపోయిన రాహుల్... మంగళవారం తన స్నేహితులతో కలిసి దిల్లీలోని నెహ్రూ ప్లేస్లో ఉన్న ఐనాక్స్ థియేటర్లో ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ సినిమాను వీక్షించారు.ఆయన ఎప్పుడు ధరించే తెల్లదుస్తుల్లో కాకుండాఈసారి కొత్తగా టీషర్ట్లో దర్శనమిచ్చారు.
అయితే రాహుల్ సినిమా చూడటంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఓపక్క ఎన్నికలు దగ్గరపడుతుంటే ఇప్పుడు రాహుల్కి సినిమా చూడాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. వీటిపై ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. " గుజరాత్ ఎన్నికలు, ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీ తర్వాత ఎంతో అలసిపోయిన రాహుల్ ఒక సినిమా చూస్తే తప్పేంటి?. 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భాజపా ఓడిపోయినప్పుడు ఏబీ వాజ్పేయ్, ఎల్కే అడ్వాణీ కూడా దిల్లీలోని ఓ థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లారు" అని ప్రశ్నించారు.