ఢిల్లీ, మే 2 : ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఈ రోజు ఢిల్లీ వేదికగా 32వ మ్యాచ్ జరగనుంది. దిల్లీ డేర్డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరులో జరుగుతున్న మ్యాచ్ టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి అజింక్య రహానె ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వరుస ఓటములతో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్ గెలవాలని కసితో ఉంది . రాజస్థాన్ తుదిజట్టులో డీఆర్సీ షార్ట్, శ్రేయస్ గోపాల్ చోటు దక్కించుకొన్నారు. ఢిల్లీ జట్టులో రాహుల్ తెవాతియా స్థానంలో షాబాజ్ నదీమ్ స్థానం సంపాదించుకొన్నాడు.