మీరట్, మే 3: ఉత్తరప్రదేశ్ పరిధిలోని మీరట్ లిసారి మురికి వాడల్లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో మొదలైన మంటలు క్రమంగా గుడిసెలన్నింటికీ వ్యాపించాయి. దీంతో అక్కడి ప్రజలు భయందోళనలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు తెలియ రాలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.