పట్నా, మే 4 : బిహార్ లో జరిగిన బస్సు ప్రమాదంలో ఓక కొత్త ట్విస్ట్ బయటపడింది. ఈ ప్రమాదంలో దాదాపు 27 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు. కానీ ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన మాట నిజమే గానీ ఎవరూ చనిపోలేదని బిహార్ మంత్రి దినేశ్ చంద్ర యాదవ్ తెలిపారు.
ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. ప్రమాదంలో 27 మంది మృత్యువాతపడ్డారన్న విషయాన్ని మీడియా ముందుకు వెల్లడించింది ఆయనే కావడం గమనార్హం. పైగా బస్సు పూర్తిగా కాలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అన్నారు. ఈ ఘటనపై గురువారం బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
బిహార్లో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. మోతీహరి ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 27మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారని తొలుత అధికారులు తెలిపారు