కోపెన్హాగెన్, మే 4 : ప్రపంచంలో అత్యధిక ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ పురష్కారాన్ని ఈ ఏడాది సాహిత్యంలో ఈ ఏడాది ఇవ్వడంలేదు. అకాడమీ ర్యాంకుల్లో ఉన్న సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు, మరికొన్ని సమస్యల నేపథ్యంలో అకాడమీ ప్రతిష్ఠ దిగజారిందని, ఈ పరిస్థితుల్లో సాహిత్యంలో నోబెల్ అవార్డు గ్రహీతను కమిటీ నిర్ణయించగలిగే స్థితిలో లేదని వెల్లడించింది. అవార్డులను అందించే స్వీడిష్ అకాడమీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
2018లో ఇవ్వాల్సిన నోబెల్ సాహిత్య బహుమతిని కూడా 2019లో ఇస్తామని అకాడమీ తెలిపింది. ఇతర నోబెల్ అవార్డులకు దీంతో సంబంధం లేదని, అవి యధావిధిగా ఇస్తామని పేర్కొంది. 1943 యుద్ధం తర్వాత ప్రతిష్టాత్మకమైన నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటించకపోవడం ఇదే తొలిసారి.