ముంబై గెలిచింది.. రేస్ లో నిలిచింది.

     Written by : smtv Desk | Sat, May 05, 2018, 11:28 AM

ముంబై గెలిచింది.. రేస్ లో నిలిచింది.

ఇండోర్‌, మే 5 : ఐపీఎల్ -11 సీజన్ లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌ రేసు లో నిలిచింది. గెలవక తప్పని మ్యాచ్ లో కింగ్స్ X1 పంజాబ్ పై రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ముంబైకిది మూడో విజయం. ఎనిమిదో మ్యాచ్‌ ఆడిన పంజాబ్‌ మూడో ఓటమి చవిచూసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ జట్టులో క్రిస్‌ గేల్‌ (50), స్టాయినిస్‌ (29 నాటౌట్‌) రాణించడంతో ఆ జట్టు 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. బుమ్రా (1/19), మయాంక్‌ మార్కండే (1/29) పంజాబ్ ను కట్టడి చేశారు.

తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ జట్టులో సూర్యకుమార్‌ యాదవ్ (57), ఆర్థ శతకంతో రాణించగా... చివరిలో కెప్టెన్ రోహిత్ (24), క్రునాల్ పాండ్య(31) బ్యాట్ ఝుళిపించారు. దీంతో ఆ జట్టు 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలుపొందింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సూర్యకుమార్‌ యాదవ్ కు దక్కింది.





Untitled Document
Advertisements