జేడీ(ఎస్‌) తో పొత్తులేకున్నా విజయం మాదే : సిద్ధరామయ్య

     Written by : smtv Desk | Sat, May 05, 2018, 01:18 PM

జేడీ(ఎస్‌) తో పొత్తులేకున్నా విజయం మాదే : సిద్ధరామయ్య

బెంగళూరు, మే 5 : కర్ణాటకలో రానున్న ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు తమ ప్రచారాలతో హోరెత్తుస్తున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ మరోసారి సీఎం పీఠం దక్కించుకోవాలని తహతహలాడుతుంది. మరో వైపు బీజేపీ పార్టీ దక్షణాదిలో పాగా వేయడానికి కసరత్తులు చేస్తుంది. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకోకపోయినా విజయం సాధిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... "ఇటీవల జేడీ(ఎస్‌) అధినేతను అంతలా పొగడ్తలతో ముంచెత్తిన మోదీ.. ఇప్పుడు ఆ పార్టీకి అసలు ఓట్లే వేయద్దని అంటున్నారు. ఒక మాటపై నిలబడని పార్టీలను ప్రజలు ఎలా నమ్మగలరు? ఇటీవల మోదీ చేస్తున్న విమర్శలు మా మీద ఎంత మాత్రం ప్రభావం చూపవు. అంతేకాదు జేడీ(ఎస్‌)తో పొత్తు పెట్టుకోకున్నా మేం విజయం సాధిస్తాం. ఈసారి కూడా అధికారంలోకి వచ్చేది మేమే. నేను పోటీ చేసిన ఆ రెండు స్థానాల్లోనూ నేనే గెలుస్తాననే నమ్మకం నాకు 100శాతం ఉంది" అని వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements