అంకారా, మే 6: టర్కీ రాజధాని అంకారాలో కురిసిన ఆకాల వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలపాటు ఓ మోస్తరు వర్షం పడుతుందని అధికారులు తొలుత అనుకున్నారు. అయితే తొమ్మిది నిమిషాల్లోనే కుండపోత వాన కురిసింది. ఫలితంగా మమాక్ జిల్లాలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదలో అనేక కార్లు, ట్రక్కులు కొట్టుకుపోయాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా రూ.కోట్లలో ఆస్తినష్టం సంభవించగా.. నలుగురు గాయపడ్డారు. అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.