కర్ణాటక పీఠం మాదే : సిద్ధరామయ్య

     Written by : smtv Desk | Sun, May 06, 2018, 01:12 PM

కర్ణాటక పీఠం మాదే : సిద్ధరామయ్య

బెంగళూరు, మే 6: కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు ప్రచారాలతో రాష్ట్రాన్ని హోరేత్తేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ మరో సారి అధికారంలోకి రావాలని పరితపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరుపున 'వన్ మ్యాన్ ఆర్మీ' గా సిద్ధరామయ్య దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో తిరిగి అధికార పీఠం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. " కర్ణాటకలో హంగ్‌ వచ్చే ప్రసక్తే లేదు. మాకు సంపూర్ణ ఆధిక్యం వచ్చి తీరుతుంది. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఈ ఎన్నికల్లో మాకు, యడ్యూరప్పకు మధ్యే పోటీ ఉంది. మాకు మోదీకి పోటీ అని బీజేపీ భావిస్తే మేము ఏమి చెయ్యలేము. తాజా పరిణామాలు చూస్తుంటే భాజపా, జేడీఎస్‌ మధ్య అవగాహన ఒప్పందం ఉన్నట్లు అనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements