న్యూఢిల్లీ, మే 7 : స్వయంగా ప్రధాన మంత్రే ప్రజల చెవుల్లో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. హుబ్లీలో విలేకరులతో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. కర్ణాటకలోని మహదాయి నీటి పంపిణీ వ్యవహారంలో అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా దళితులకు తానే ఆశాకిరణమంటూ అబద్ధాలు చెప్పడమే కాక అల్ప సంఖ్యాకులను దేశం నుంచి బయటకు పంపేందుకు యత్నిస్తున్నారంటూ ఆరోపించారు.
ఏ విషయం గురించైనా తాను ప్రశ్నిస్తే హిందూమత వ్యతిరేకి అంటూ ముద్ర వేస్తున్నారని.. 'జస్ట్ ఆస్కింగ్' పేరిట ప్రశ్నించే బాధ్యత తనకు ఉందన్నారు. 'జస్ట్ ఆస్కింగ్' రాజకీయ పార్టీ కాదని అదొక ఆందోళన సంస్థ స్పష్టం చేశారు. తను చేసే ఈ పోరాటంలో ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొన్నారు.