రాంచి, మే 9 : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు న్యాయస్థానం ఐదు రోజులు పెరోల్ ఇచ్చింది. దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూకు అతని కుమారుడు తేజ్ ప్రతాప్ వివాహం కోసం పెరోల్ ఇచ్చినట్లు న్యాయస్థానం వెల్లడించింది. బిహార్కు చెందిన మంత్రి చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్ను తేజ్ ప్రతాప్ పెళ్లాడబోతున్నారు. ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు లాలూ హాజరుకాలేకపోయారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రస్తుతం ఝార్ఖండ్ రాజధాని రాంచిలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.