ఇజ్రాయెల్, మే 9 : ఇతర దేశ అధినేతలు వేరే దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు మర్యాదలు ఒక రేంజ్ లో ఉంటాయి. వారు తినే ఆహారం నుండి భద్రత వరకు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని కుటుంబంతో కలసి విందుకు హాజరైన జపాన్ ప్రధానికి షింజో అబేకు చెఫ్ బూటులో ఆహార పదార్థాలను ఉంచి వడ్డించడం వివాదాస్పదంగా మారింది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అత్యంత ఇష్టపడే చెఫ్ మోషే సెర్గీ ఈ విందుకు వంటకాలను తయారు చేశారు. అబేకు డిసర్ట్తో పాటు ఓ బూటులో చాకెట్లను ఉంచి సర్వ్ చేయడంపై జపాన్ దౌత్యవేత్తలు మండిపడుతున్నారు. బూటుతో ఆహారాన్ని అందించడాన్ని జపాన్లో తీవ్రంగా, ఘోర అవమానంగా భావిస్తారని చెప్పారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని, ప్రధాన చెఫ్ మోషే సెర్గే విరవణ ఇచ్చారు. అది నిజమైన షూ కాదని.. షూ ఆకారంలో పలు పదార్థాలతో దాన్ని రూపొందించినట్లు చెప్పారు.