హైదరాబాద్, మే 9: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్రెడ్డి తల్లి నారాయణమ్మ (95) బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమెకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం స్మశానవాటికలో సాయంత్రం 4:30 గంటలకు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.