అక్రమ ఆయుధాల కేసులో భాను కిరణ్‌కు ఏడాది జైలు

     Written by : smtv Desk | Wed, May 09, 2018, 06:12 PM

అక్రమ ఆయుధాల కేసులో భాను కిరణ్‌కు ఏడాది జైలు

హైదరాబాద్, మే 9 ‌: మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్‌కు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో నాంపల్లి కోర్టు ఏడాది జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధించింది. సూరి హత్య జరగకముందే 2009లో భాను, మరో ఇద్దరిని సికింద్రాబాద్‌లో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి తుపాకులు, కత్తులు తీసుకొచ్చి తమ వద్ద ఉంచుకున్నారన్న అభియోగంపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది.





Untitled Document
Advertisements