మళ్లీ పప్పులో కాలేసిన గూగుల్

     Written by : smtv Desk | Wed, May 09, 2018, 06:38 PM

 మళ్లీ పప్పులో కాలేసిన గూగుల్

న్యూఢిల్లీ, మే 9 : సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ మళ్లీ పప్పులో కాలేసింది. ఇటీవల మాజీ ప్రధాని నెహ్రూ సంబంధిత సమాచారానికి మోదీ ఫోటోను ఉంచి అభాసుపాలైన గూగుల్ తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి పొరపాటే చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్‌ రాగూర్‌ 157వ జయంతి సందర్భంగా గూగుల్‌లో ‘భారత జాతీయ కవి’ పేరిట టాప్‌ ట్రెండింగ్‌ను సృష్టించింది. అయితే గూగుల్‌లో ఆ పేరుతో పరిశోధించిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.


నోబెల్‌ గ్రహీత ఠాగూర్‌ స్థానంలో.. ఆధ్యాత్మిక వేత్త శ్రీ అరబిందో ఫోటో కనిపిస్తుంది. అదే కాకుండా మే 9న ఠాగూర్‌ పుట్టిన రోజు అయితే... తేదీని మే 7 అని తప్పుగా చూపిస్తోంది. ఈ వ్యవహారంపై బెంగాలీలు మండిపడుతున్నారు. తప్పులు లేకుండా ప్రచురించటం గూగుల్‌కి సాధ్యం కాదా? అంటూ కొందరు మండిపడుతున్నారు.





Untitled Document
Advertisements