ఢిల్లీ, మే 10 : దేశరాజధానిలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేతులమీదుగా 'మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్' ఆరంభమైంది. చలనచిత్ర ప్రదర్శన రంగంలో సామాన్యుడికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వినోదం పంచేందుకే ఈ వినూత్న ప్రయోగం చేపట్టారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సతీష్ కౌశిక్, పారిశ్రామికవేత్త సునీల్ చౌదరి కలిసి ‘పిక్చర్ టైం’ బ్రాండ్ పేరుతో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు.
6030 అడుగుల వైశాల్యంలోఉండే ఈ తాత్కాలిక థియేటర్లో సుమారు 150 నుంచి 200 సీట్లు పడతాయి. సినిమాలకు దూరంగా ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతాలకు దీంతో మేలు జరుగుతుంది. సినిమా స్థాయిని బట్టి టికెట్టు ధర రూ.30 నుంచి రూ.60వరకు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.