తుదిఅంకానికి కర్ణాటక కదనం..

     Written by : smtv Desk | Thu, May 10, 2018, 12:08 PM

తుదిఅంకానికి కర్ణాటక కదనం..

బెంగళూరు, మే 10 : కర్ణాటక ఎన్నికల ప్రచారం తుదిఅంకానికి చేరుకుంది. ఈ నెల 12న జరిగే ఈ మహా సమరానికి ఇప్పటికే పలు ప్రధాన పార్టీలు విజయం కోసం చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. కాగా గురువారం ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వం ముగియనుండటంతో చివరిసారి ఓటర్లను కలిసి తమకు ఓటేయాలని కోరేందుకు రాజకీయ నేతలు సమాయత్తమయ్యారు. మే 12న రాష్ట్రంలో 223 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలను మే 15న వెల్లడించనున్నారు.





Untitled Document
Advertisements