మలేషియా, మే 10 : మలేషియా ప్రధానిగా 92 ఏళ్ల రాజకీయ కురువృద్ధుడు మహథీర్ మహ్మద్ తిరిగి ప్రధానిగా ఎన్నికయ్యారు. దీంతో మలేషియాకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి సుమారు 60 ఏళ్లపాటు సాగిన బరిసాన్ నేషనల్ ప్రభుత్వ పాలనకు ఫుల్ స్టాప్ పడింది. ఆయన నేతృత్వంలోని విపక్ష పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించాయి. అధికారం చేపట్టేందుకు పార్లమెంటులో 112 స్థానాలు అవసరం ఉండగా, మహథీర్ వర్గం 115 సీట్లు దక్కించుకుంది. ప్రస్తుత ప్రధాని నజాబ్ రజాక్పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో విపక్షాలతో కలిసి ఆయన ఎన్నికల బరిలో దిగారు.