'రైతుబంధు' ను ఏపీలో అమలు చేయండి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

     Written by : smtv Desk | Fri, May 11, 2018, 12:20 PM

'రైతుబంధు' ను ఏపీలో అమలు చేయండి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

విజయవాడ, మే 11 : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ 'రైతుబంధు' పథకాన్ని ప్రవేశపెట్టారు. అదే మాదిరి ఆంధ్రప్రదేశ్‌లోని రైతాంగానికి ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు.

రాష్ట్రంలో నేటికీ రైతు రుణమాఫీ అమలు కాలేదని.. నాలుగేళ్లలో రైతుల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాలేదని అందులో పేర్కొన్నారు. డెల్టా ప్రాంతాల్లోని కౌలు రైతులకు ‘రైతుబంధు’ వంటి పథకం ఎంతగానో ఉపయోగకరమన్నారు.'రైతుబంధు' పథకంలో భాగంగా ఎకరానికి రూ.4వేల చొప్పున పంట పెట్టుబడిని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో పాటు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను సైతం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పంపిణీ చేశారు.





Untitled Document
Advertisements