దేశంలో ఎక్కడ లేని పథకం 'రైతు బంధు' : కేటీఆర్‌

     Written by : smtv Desk | Fri, May 11, 2018, 05:24 PM

 దేశంలో ఎక్కడ లేని పథకం 'రైతు బంధు' : కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల, మే 11 : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 'రైతు బంధు' పథకం ప్రవేశపెట్టామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవాం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'రైతు బంధు' పథకం కింద సిరిసిల్ల జిల్లాలో రూ. 100 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే యాసంగికి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి చెప్పారు. వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి రైతులకు రూ. 5లక్షల భీమా పథకం అమలు చేస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 'రైతుబంధు' పథకంలో భాగంగా ఎకరానికి రూ.4వేల చొప్పున పంట పెట్టుబడిని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో పాటు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను సైతం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పంపిణీ చేశారు.





Untitled Document
Advertisements