హైదరాబాద్, మే 13 : తెలంగాణ ఐకాస ఛైర్మన్ పదవికి అచార్య కోదండరామ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఐకాస కార్యవర్గం ఆమోదం తెలిపి నూతన ఛైర్మన్తో పాటుగా కమిటీని ఎన్నుకుంది. తార్నాకలోని సెయింట్ ఆన్స్ కాన్సలేట్లో తెలంగాణ ఐకాస విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే కోదండరామ్ రాజీనామాను ఆమోదించారు. ఐకాస నూతన అధ్యక్షుడిగా విద్యుత్ ఐకాస అధ్యక్షుడు రఘును ఎన్నుకున్నారు.
పాలనలో మార్పుకోసమే జన సమితి పార్టీని పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని పెర్కొన్నారు. బలమైన ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి ఐకాస కృషి చేస్తోందన్నారు. రాజకీయాల్లో మార్పు కోసం ఐకాస నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పారు.