హైదరాబాద్, మే 16 : హీరోయిన్ సమ౦త.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. "రంగస్థలం" లో రామలక్ష్మి గా, "మహానటి" లో మధురవాణి గా ఆమె నటించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సాధారణంగా పెళ్లైన తర్వాత హీరోయిన్స్ కు అవకాశాలు సరిగా రావు అనే భావనను సమ౦త బ్రేక్ చేసింది. టాలెంట్ ఉంటే అవకాశాలకు కొదువ లేదు అని నిరూపించింది. పాత్రలతో పాటు, కథల విషయంలోనూ అసలే మాత్రం రాజీపడటం లేదు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతోంది.
తమిళంలోనూ తన హావా కొనసాగిస్తోంది. ఇటీవల ఆమె నటించిన "ఇరుంబి తిరై" చిత్రం తెలుగులో 'అభిమన్యుడు' గా రిలీజ్ అయింది. ఈ చిత్రంలో కూడా సమ౦త నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా సమ౦త తమిళంలో విజయ్ సేతుపతి సరసన నటించేందుకు అంగీకరించింది. ఈ చిత్రంలో రామలక్ష్మి తరహా పాత్రలో డీ గ్లామర్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఆ పాత్ర కోసం ఆమె కరాటేలో కూడా శిక్షణ తీసుకొంటోందని తెలిసింది. ఈ చిత్రంతో సమ౦త ఖాతాలో మరో హిట్ పడ్డట్లే అని అభిమానులు అంటున్నారు.