హైదరాబాద్, మే 20 : టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అభిమానులు ఉన్నారు. సినీరంగంలో, క్రీడా రంగంలోని కొందరు అతన్ని స్పూర్తిగా తీసుకొంటారు. ధోనిని ఒక్కసారి చూస్తే చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో తెలుగబ్బాయి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ ఒకరు. కాగా అతన్ని ఈ ఆదివారం మహేంద్రుడు ఆశ్చర్యానికి గురిచేశాడు.
తాను సంతకం చేసిన బ్యాట్ను కిదాంబి శ్రీకాంత్కు ధోనీ బహుమతిగా పంపించాడు. ఊహించని ఈ బహుమతికి శ్రీకాంత్ ఆనందంలో మునిగిపోయి.. వెంటనే ధోనికి ధన్యవాదాలు తెలిపాడు. "అద్భుతమైన బహుమతికి ధన్యవాదాలు. నేనిప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. #MSDhoni #fanmoment" అని కిదాంబి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
ఈ మధ్యనే ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో కిదాంబి శ్రీకాంత్ రజత పతకం సాధించాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అతడు బ్యాడ్మింటన్లో ప్రపంచ మూడో ర్యాంకుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఎంఎస్ ధోనీ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు రెండవ స్థానంలో ఉంది.
Thank you @msdhoni for the wonderful gift and can’t tell how happy I am. This just made my day. #MSDhoni #fanmoment pic.twitter.com/0wJhiOsaFW
— Kidambi Srikanth (@srikidambi) May 20, 2018