భవిష్యత్తులో జేడీఎస్‌తో కలిసి పనిచేస్తా..

     Written by : smtv Desk | Wed, May 23, 2018, 03:24 PM

భవిష్యత్తులో జేడీఎస్‌తో కలిసి పనిచేస్తా..

బెంగళూరు, మే 23 : నేడు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా పలువురు నేతలకు ఆహ్వానం అందింది. ఈ మేరకు బెంగళూరు బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. కుమారస్వామికి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్తులో జేడీఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్ని ఏకం కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందే చంద్రబాబు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ నేత మాయావతితో భేటీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నట్లు సమాచారం.






Untitled Document
Advertisements