హైదరాబాద్, మే 23 : అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథతో రూపొందించిన "మహానటి" సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సమ౦త, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ చిత్రంలో సమ౦త జర్నలిస్ట్ 'మధురవాణి' గా ప్రేక్షకులను అలరించింది. 80ల నాటి వేషధారణలో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ప్రేక్షకుల నుండే కాకుండా సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంది.
తాజాగా మధురవాణి వెర్షన్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. సమంతతో పాటు విజయ్ దేవరకొండ ఈ వీడియోలో దర్శనమిస్తున్నారు. ఈ వీడియోలోని విజువల్స్ సరదాగా అనిపిస్తూ.. అభిమానులను అలరిస్తున్నాయి. అయితే విడుదలైన కాసేపట్లోనే ఈ వీడియో వైరల్గా మారడం విశేషం. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించారు.