హైదరాబాద్, మే 23 : మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన అల్లు శిరీష్ 'గౌరవం', 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు', సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. 'శ్రీరస్తు శుభమస్తు' మాత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకొంది. కాగా ఇప్పుడు ఈ యంగ్ హీరో ఇతర సినీ పరిశ్రమల నుండి కొత్త తరహా పాత్రలు చేయడానికి శ్రద్ధ చూపిస్తున్నాడు. ఇప్పటికే మోహన్లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ సినిమా '1971 బెయాండ్ బార్డర్స్' లో కీలక పాత్రలో నటించి మెప్పించాడు.
ఇటీవల అల్లు శిరీష్ తమిళంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకొన్నారు. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, తమిళ సూపర్స్టార్ సూర్య కాంబినేషన్లో ఓ చిత్రం రానుంది. అయితే ఈ సినిమాలో శిరీష్ నెగెటివ్ రోల్లో నటిస్తున్నట్టుగా తమిళ పత్రికల్లో, టీవీల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ న్యూస్ మరింత పెద్దగా అవ్వకముందే అల్లు సన్నిహితులు కొట్టిపారేశారు. ఈ వార్తలపై స్పందించిన శిరీష్ టీం స్పష్టత ఇచ్చింది.
సూర్య సినిమాలో అల్లు శిరీష్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని నెగిటివ్ రోల్ కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన చేసేది నెగెటివ్ రోల్ కాదని, ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో శిరీష్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. సూర్య హీరోగా 'వీడొక్కడే', 'బ్రదర్స్' లాంటి మూవీలను తెరకెక్కించిన కేవీ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అఖిల్ ఫేం సయేషా హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది.