మరో ప్రత్యేక గీతంలో మిల్కీ బ్యూటీ..

     Written by : smtv Desk | Thu, May 24, 2018, 12:25 PM

మరో ప్రత్యేక గీతంలో మిల్కీ బ్యూటీ..

హైదరాబాద్, మే 24 : ఐటం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పటికే టాలీవుడ్ లో శృతి హాసన్, కాజల్ వంటి అగ్ర హీరోయిన్స్ ఐటం సాంగ్స్ బరిలో ఉన్నా.. ఈ మిల్కీ బ్యూటీ లెక్క వేరేలా ఉంది. వారితో పోలిస్తే ఈ అమ్మడు లిస్టు కాస్తంతా పెద్దగానే ఉంది. 'అల్లుడు శీను'.. 'స్పీడున్నోడు'.. 'జాగ్వార్'.. వంటి చిన్న హీరోల సినిమాల్లోనే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ'లోకూడా ఐటెం సాంగ్ మెరిసింది. "స్వింగ్ జరా" అంటూ ఆమె వేసిన స్టెప్పులకు అభిమానులు ఫిదా అయిపోయారు.

ఈ పాటలో ఆమె హావభావాలు సైతం అదుర్స్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ బ్యూటీ మరో ఐట౦ సాంగ్ లో నటించేందుకు ఒప్పుకోవడం విశేషం. అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న "సవ్యసాచి" చిత్రంలో.. 'నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయితు' అనే పాటకు డ్యాన్సులు చేయనుంది. ఇలా వరుసగా ప్రత్యేక గీతాల్లో నర్తిస్తున్న ఈ భామకు పోటీగా లేరు అనడంలో అతిశయోక్తి లేదు. మరి స్పెషల్ సాంగ్స్ లో మెరిసిపోతున్న తమన్నా 'లగ్గాయిత్తు' పాటతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట.





Untitled Document
Advertisements