ఆది కొత్త సినిమా 'నీవెవరో'..

     Written by : smtv Desk | Thu, May 24, 2018, 02:17 PM

ఆది కొత్త సినిమా 'నీవెవరో'..

హైదరాబాద్, మే 24 : టాలీవుడ్ లో విలన్ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు ఆది పినిశెట్టి. ఆయన తమిళంతో పాటు తెలుగు చిత్రాలతోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'సరైనోడు' లో విలన్ గా, 'నిన్నుకోరి', రంగస్థలం వంటి చిత్రాల్లో పాజిటివ్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కాగా ఆది ఈ మధ్యకాలంలో పూర్తి తరహా తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్నారు. తాజాగా అతను మరో తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ‘నీవెవరో’ టైటిల్‌ను ఖరారు చేశారు.

టైటిల్‌ పోస్టర్‌ను కథానాయకుడు నాని ట్విటర్‌లో విడుదల చేశారు. "ఆది కొత్త సినిమా టైటిల్‌ ‘నీవెవరో’. మా ప్రియమైన ‘అరుణ్‌’ నటించనున్న సినిమా టైటిల్‌ లోగోను ఆవిష్కరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కోనవెంకట్‌, తాప్సి, రితికా సింగ్‌కు ఆల్‌ ది బెస్ట్‌" అని పేర్కొన్నారు. ఆది ఈ సినిమాలో అంధుడిగా నటిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఫస్ట్‌లుక్‌ విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో ఆదికి జోడీగా తాప్సి, 'గురు' ఫేం రితికా సింగ్‌ నటిస్తున్నారు. ఆది, తాప్సి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. గతంలో వీరిద్దరూ ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో జంటగా నటించారు. ' లవర్స్‌' ఫేమ్‌ హరి దర్శకత్వంలో ఎమ్‌వీవీ సత్యనారాయణతో కలసి రచయిత కోన వెంకట్‌ తన కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.





Untitled Document
Advertisements