నన్ను తప్పిస్తారేమోనని భయపడేదాన్ని...

     Written by : smtv Desk | Thu, May 24, 2018, 03:26 PM

నన్ను తప్పిస్తారేమోనని భయపడేదాన్ని...

ముంబై, మే 24 : ప్రియాంక చోప్రా అటు బాలీవుడ్, హాలీవుడ్ లలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. మొన్నీమద్యే "బేవాచ్" సినిమాతో హాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంక "భారత్" అనే హిందీ సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తన అనుభవాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎవరు తెలియదని.. కెరీర్ ప్రారంభంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నానని వెల్లడించింది.

"నేను 15 ఏళ్ల క్రితం బాలీవుడ్‌లో కాలుమోపాను. అయితే ఇండస్ట్రీలోని ప్రతివారికీ 'అంకుల్' ఉంటారు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా ప్రొడక్షన్ హౌస్‌లోకి ప్రవేశించడం చాలా కష్టం. నాకు మిస్ వరల్డ్ కిరీటం లభించాక బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. కెరియర్ ప్రారంభంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికి నాకు బాలీవుడ్‌లో ఎవరూ తెలియదు. ఎవరిని చూసినా ఎవరో ఒకరికి బంధువులై ఉన్నారు. ఒకవేళ నన్ను సినిమాల్లోకి తీసుకున్నా ఎక్కడ మళ్ళీ నన్ను తప్పిస్తారోనని భయపడేదాన్ని" అంటూ చెప్పుకొచ్చింది.





Untitled Document
Advertisements