హైదరాబాద్, మే 26 : దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న సమ౦త.. హట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. 'రంగస్థలం', 'మహానటి' చిత్రాలు ఘన విజయం సాధించి బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో సమ౦త నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అయితే విశాల్ హీరోగా తమిళంలో పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా "ఇరుంబు తిరై". ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది.
అయితే ఇప్పుడదే సినిమాను తెలుగులో "అభిమన్యుడు" గా తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో విశాల్ మాట్లాడారు. హీరోయిన్ సమంత అంటే లక్కీ ఛార్మ్ అంటూ ఆమెను తెగ పొగిడేశాడు. అంతేకాకుండా.. "హీరోగా ఈ సినిమా సక్సెస్ నాకెంత సంతోషమో సమంతకు హిట్ క్రెడిట్ రావడం అంతే సంతోషం.
ఎందుకంటే పెళ్లయిన హీరోయిన్లు సినిమాలు చేయలేరు. కాని ఆమె ఆ వదంతులను బ్రేక్ చేసింది. రేపటి తరం హీరోయిన్లకు సామ్ రోల్ మోడల్ గా నిలుస్తుంది. డైరెక్టర్లు, నిర్మాతలు పెళ్లైన అమ్మాయిలను హీరోయిన్లుగా హ్యాపీగా తీసుకోవచ్చు" అంటూ చెప్పుకొచ్చాడు. తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ గా చేయమంటూ సరదాగా సమంతకు ఓపెన్ రిక్వెస్ట్ పెట్టేశాడు విశాల్. కాగా 'అభిమన్యుడు' సినిమా జూన్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.