జూలైలో రానున్న 'సాక్ష్యం'..!

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 01:53 PM

జూలైలో రానున్న 'సాక్ష్యం'..!

హైదరాబాద్, మే 26 : బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, శ్రీవాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "సాక్ష్యం". ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తో౦ది. పంచభూతాలు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్ట్రర్లు, టీజర్ బాగుండటంతో సినిమా ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదలచేయాలని నిర్మాతలు అనుకున్నారు.

కానీ ఇప్పుడు చిత్రాన్ని జూలై నెలకు వాయిదా వేసినట్లు సమాచారం. అయితే ఈ వాయిదా వెనకున్న కారణాలేమిటనేది తెలియరాలేదు. త్వరలోనే నిర్మాతలు కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్థర్ ఏ విల్సన్, పీటర్ హెయిన్స్ వంటి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హర్షవర్థన్ ఈ సినిమాకు స్వరాలూ సమకూర్చారు.





Untitled Document
Advertisements