ముగిసిన జనసేనాని దీక్ష ..

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 06:16 PM

ముగిసిన జనసేనాని దీక్ష ..

శ్రీకాకుళం, మే 26 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం ఐదుగంటలకు నిరాహార దీక్షను విరమించారు. ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సాయంత్రం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తాను రాజకీయ లబ్దికోసం ఈ దీక్ష చేయలేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."ఉద్దానం వెనుకబడ్డ ప్రాంతం కాదు. వెనక్కి నెట్టబడిన ప్రాంతం. రూ.2,000 కోట్లు పుష్కరాలకు ఖర్చుపెట్టిన వారు.. జబ్బుతో 20,000 మంది చనిపోయిన చోట ఖర్చు పెట్టలేరా. రాష్ట్రాన్ని మోసం చేసిన కేంద్రం, ఆ కేంద్రానికి మద్దతిచ్చిన తెలుగుదేశంపై నిరసనగా ఆందోళన చేపట్టాను. సామాజిక రాజకీయ చైతన్యం కోసం జనసేన పార్టీ పని చేస్తుంది. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను సమావేశపరిచి కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఉద్దానం సమస్యను పరిష్కరించవచ్చు" అని ఆయన వెల్లడించారు.





Untitled Document
Advertisements