హైదరాబాద్, మే 26 : ఆంధ్రాలో కేసీఆర్కు బ్యానర్లు కట్టి పాలాభిషేకం చేస్తున్నారని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు నల్గొండ జిల్లాకు చెందిన కార్యకర్తలు కొందరు నేడు కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. అభివృద్దిలో తెలంగాణ దూసుకుపోతోందని.. ఏపీలో కూడా టీఆర్ఎస్ పార్టీని పెట్టమని ఆహ్వానిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా మహారాష్ట్రలోని మొత్తం నలభై గ్రామాలు సైతం తెలంగాణలో కలవాలనుకుంటున్నాయని ఈ మేరకు వెల్లడించారు.