మోదీని పొగిడిన చైనా..

     Written by : smtv Desk | Mon, Jun 04, 2018, 07:14 PM

మోదీని పొగిడిన చైనా..

చైనా, జూన్ 4 : భారత్ పై కారాలు మిరియాలు నూరే చైనా అనూహ్యంగా ప్రధాని మోదీ పొగిడింది. ఇండియా-చైనా సంబంధాల గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చైనా సంతోషం వ్యక్తం చేసింది. సింగపూర్ పర్యటన సందర్భంగా 'ఏషియాస్ ప్రీమియర్ డిఫెన్స్ అండ్ స్ట్రాటెజిక్ అఫైర్స్' కాన్ఫరెన్స్ లో మోదీ ప్రసంగిస్తూ, ఇండియా, చైనాలు ఒకరిపైమరొకరు నమ్మకంతో, కాన్ఫిడెన్స్ తో కలసి పని చేస్తే ఆసియాకే కాకుండా యావత్ ప్రపంచానికే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. సరిహద్దు సమస్యతో పాటు మరెన్నో విషయాల్లో ఇరుదేశాలు ఎంతో సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని చెప్పారు.

ఈ సందర్భంగా చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ మాట్లాడుతూ.." ఇండో-చైనా ద్వైపాక్షిక సంబంధాల గురించి మోదీ చేసిన వ్యాఖ్యలు ఆనందదాయకం. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే ఇలాంటి స్పందనను మేము స్వాగతిస్తున్నాము. ఇటీవలే మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ల మధ్య జరిగిన భేటీ..అంతర్జాతీయ అంశాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాల గురించి లోతైన చర్చ జరిపారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిణతితో తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు" అని ఆయన తెలిపారు.





Untitled Document
Advertisements