హైదరాబాద్, జూన్ 6 : 'నీట్'లో మంచి ర్యాంకు రాలేదన్న ఆవేదనతో జస్బిన్ కౌర్ అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరి హృదయాలను కలిచివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ కూడా స్పందించారు. 'నీట్'లో విజయం సాధించడంలో విఫలమై, ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ అమ్మాయి జస్లిన్ కౌర్ ఉదంతం తన హృదయాన్ని కదిలించిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన అంజన్ కుమార్ .."విద్యార్థిని ఆత్మహత్య చాలా బాధాకరం. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ర్యాంకులు, మార్కులు రాలేదని విద్యార్థులు ధైర్యాన్ని కోల్పోవద్దు. సమయం కోసం ఎదురుచూసి విజయం సాధించాలని, విద్యార్థులు పట్టుదలను పెంచుకోవాలి" అని ఆయన సూచించారు.