కర్నూలు, జూన్ 6: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తుపెట్టుకుంటే తాను ఉరేసుకోవటానికి సిద్ధమని వెల్లడించారు. కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "కాంగ్రెస్తో కలిసే ప్రసక్తే లేదు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన వాళ్లతో మేము ఎలా కలుస్తాం. ఇది నా అభిప్రాయం కాదు.. పార్టీ నిర్ణయం.. అదే కనుక జరిగితే నేను ఉరి వేసుకుంటానంటూ' ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు.
మోసపూరిత రాజకీయాల్లో భాగంగానే ప్రతిపక్ష వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని ధ్వజమెత్తారు. పవన్, జగన్ కేంద్రంతో చేతులు కలపడం బాధాకరని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా... ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలోనే పొత్తుల విషయం నిర్ణయిస్తామని కేఈ వెల్లడించారు.