కాదేది కల్తీకి అనర్హం...

     Written by : smtv Desk | Wed, Jun 06, 2018, 08:31 PM

కాదేది కల్తీకి అనర్హం...

హైదరాబాద్, జూన్ 6 : ప్రస్తుత సమాజంలో వ్యాపారస్తులు డబ్బు సంపాదనే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నరీతిలో వర్తకులు రెచ్చిపోతున్నారు. సొంత లాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. ఇంతవరకు మిరియాలు, పసుపు, ఆవాలు, కల్తీ చేయడం విన్నాం. ఇప్పుడు ఏకంగా గోధుమ పిండిని కూడా కల్తీ చేసి అమ్మేస్తున్నారు. బ్రాండెడ్ పేర్ల ముసుగులో కేటుగాళ్ళు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని పెట్ బషీర్ బాద్ లోని దేవారంయంజల్ లోని ఓ గోదాములో ప్రముఖ 'ఆశీర్వాద్' బ్రాండ్ పేరిట దగా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సాయంతో తనిఖీ చేసి స్పెషల్ ఆపరేషన్ టీం సరుకును సీజ్ చేశారు. వాటితో పాటు అక్కడి యంత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అంజనేయులు అనే వ్యక్తి పరారిలో ఉన్నాడని.. త్వరలో అతన్ని పట్టుకొని మిగతా విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.





Untitled Document
Advertisements