నిడదవోలు, జూన్ 7 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో కొనసాగుతుంది. నడిపల్లికోట కొండాలమ్మ గుడి వద్ద జగన్ 183రోజు పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఈ యాత్రలో తేనెటీగలు కలకలం రేపాయి. ఓ ఆకతాయి చేసిన పనితో జగన్మోహన్రెడ్డి తో పాటు కార్యకర్తలు పరుగులు పెట్టారు. ఓ ఆకతాయి అక్కడ ఉన్న తేనెతుట్టెను రాయితో కొట్టడంతో తేనెటీగలు దాడికి దిగాయి. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. కాగా జగన్ ఇప్పటివరకు 2,268.4 కిలోమీటర్లు నడిచారు.