విశాఖపట్నం, జూన్ 10 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటయాత్రకు విరామం ప్రకటించారు. అయితే ఈ విరామం ఎన్ని రోజులో ప్రకటించలేదు కానీ రంజాన్ తర్వాత పోరాటయాత్ర మళ్లీ మొదలవుతందని ఆ పార్టీ తెలిపింది. ప్రస్తుతం పవన్ విశాఖలో ఉన్నారు. అక్కడ నేడు, రేపు పవన్ మేధావులతో సమావేశం అవుతారని పార్టీ వెల్లడించింది. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం గురించి పవన్ వారితో చర్చిస్తారని తెలిపింది. నేడు, రేపు ఆ చర్చలు సాగుతాయని, సోమవారం సాయంత్రం పవన్ కల్యాణ్ విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
రంజాన్ పండగ నేపథ్యంలో పవన్ కల్యాణ్ యాత్రకు విరామాన్ని ఇచ్చినట్టుగా జనసేన ప్రకటించింది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువమంది ముస్లింలు ఉన్నారని, అందుకే విరామం అని తెలిపింది. రంజాన్ అనంతరం విశాఖ నుంచినే పోరాటయాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.