హైదరాబాద్, జూన్ 11 : టీటీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పార్టీ నుంచి అధిష్టానం బహిష్కరించింది. ప్రస్తుతం మౌనంగా ఉన్న మోత్కుపల్లి తన భవిష్యత్ కార్యక్రమంపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ను కొనియాడుతున్న ఆయన టీఆర్ఎస్లో చేరుతారన్నవార్తలు వచ్చాయి.
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మీడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు. తన రాజకీయ భవితవ్యం ఎలా ఉండాలన్న దానిపై మోత్కుపల్లి ఈ నెల 13న ఆలేరులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించున్నట్లు తెలుస్తోంది.