మీడియా సమావేశానికి ఆఫ్గాన్ ఆటగాళ్ల గైర్హాజరు..

     Written by : smtv Desk | Wed, Jun 13, 2018, 05:49 PM

మీడియా సమావేశానికి ఆఫ్గాన్ ఆటగాళ్ల గైర్హాజరు..

బెంగళూరు, జూన్ 14 : ఇండియాతో జరిగే ఏకైక టెస్టు ఆడేందుకు ఆఫ్గాన్ జట్టు సిద్ధమవుతుంది. గురువారం ఇరు జట్ల మధ్య చరిత్రాత్మక టెస్టు జరగనుంది. ఈ క్రమంలో సోమవారం నాటికే బెంగళూరు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారు. మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ అనంతరం మీడియా సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. కానీ, అఫ్గాన్‌ ఆటగాళ్లు హాజరుకాలేదు. గత ఏడాది టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గాన్‌ గురువారం భారత్‌తో తన తొలి టెస్టు ఆడనుంది.

అంతటితో ఆగకుండా భారత మీడియా అత్యుత్సాహం చూపిస్తోందంటూ అఫ్గాన్‌ క్రికెటర్లు, మేనేజ్‌మెంట్‌ సభ్యులు ఆరోపించారు. "ప్రాక్టీస్‌ సెషన్స్‌లో మధ్య విరామ సమయాల్లో మీడియా వాళ్లు బాగా ఇబ్బందిపెడుతున్నారు. ప్రాక్టీస్‌ ముగించుకుని డ్రెస్సెంగ్‌ రూమ్‌కి వెళ్లే సమయంలో రషీద్‌ ఎప్పుడు చూసిన ఆటోగ్రాఫ్‌లు ఇస్తూనే కనిపిస్తున్నాడు" అని ఆ జట్టు సారథి ఆస్గర్‌ అన్నాడు.





Untitled Document
Advertisements