హైదరాబాద్, జూన్ 14 : ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు టెలికాం సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త పథకంను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆకర్షణీయ ధరలతో ఫ్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ సహా ల్యాండ్ లైన్ ప్లాన్లను వెల్లడించింది. రంజాన్ను సందర్భంగా 'ఈద్ ముబారక్ 786' ప్లాన్ను అందుబాటులోకి తెచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూ.120, రూ.310ల రీఛార్జ్ మీద పూర్తి టాక్టైం వెసులుబాటు కల్పించింది. 'ఈద్ ముబారక్ 786' ప్లాన్ కింద రీఛార్జ్ చేసుకున్న వారికి ఐదు నెలలపాటు రోజుకు 2జీబీ డేటా, 100 మెసెజ్లు, ఏ నెట్వర్క్కు అయినా అపరిమిత కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొంది.