ఊటీలో బస్సు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం..

     Written by : smtv Desk | Thu, Jun 14, 2018, 03:35 PM

ఊటీలో బస్సు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం..

ఊటీ, జూన్ 14 : తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఊటీ సమీపంలోని కూనూర్‌ రోడ్డులో తమిళనాడు ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 28 మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఊటీ నుంచి కోయంబత్తూర్‌కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

బస్సులో లోయల పడిన ప్రదేశంలో పరిస్థితి భయానకంగా ఉంది. ముక్కలు ముక్కలైన బస్సు శకలాల నడుమ విగతజీవులైన ప్రయాణికులు, రక్తచారికలతో ఆ ప్రాంతం బీభత్సంగా మారింది. సరికొత్త అందాలకు నెలవు అయిన ఊటిలో ఘోర ప్రమాదం జరగడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో గాయాలతో ఉన్నవారిని ఊటీలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements