అఫ్గాన్‌తో టెస్ట్ : ముగిసిన మొదటి రోజు ఆట..

     Written by : smtv Desk | Thu, Jun 14, 2018, 06:32 PM

అఫ్గాన్‌తో టెస్ట్ : ముగిసిన మొదటి రోజు ఆట..

బెంగళూరు, జూన్ 14 : ఆఫ్ఘానిస్థాన్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న చరిత్రాత్మక టెస్ట్‌ మొదటి రోజు ఆట ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక టెస్ట్‌తో ఆఫ్ఘానిస్థాన్ జట్టు టెస్ట్ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియాకు ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధవన్‌లు మంచి ఆరంభాన్ని అందించారు.

ఆఫ్ఘాన్ బౌలర్లను ఇరువురు సమర్థవంతంగా ఎదుర్కొంటూ శతకాలు సాధించారు. 96 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి 107 పరుగులు చేసిన ధవన్ అహ్మద్‌జాయ్ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి ఔట్ గా వెనుదిరిగాడు. ఈ దశలో మురళీ విజయ్ దూకుడు పెంచాడు. 153 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సు కొట్టి 105 పరుగులు చేసిన విజయ్ వఫాదార్ బౌలింగ్‌లో 280 పరుగుల వద్ద ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

తర్వాత లోకేశ్ రాహుల్(54) అహ్మద్‌జాయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన పుజారా(35), కెప్టెన్ అజింక్యా రహానే(10), దినేశ్ కార్తీక్(4) భారీ స్కోర్ చేయకుండానే పెవిలియన్ చేరారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సయమానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. అఫ్ఘానిస్థాన్ బౌలింగ్‌లో అహ్మద్‌జాయ్ 2, వఫాదార్, రషీద్, ముజీబ్ తలో వికెట్ దక్కించుకొన్నారు. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (10) అశ్విన్(7) ఉన్నారు.





Untitled Document
Advertisements