మెగాస్టార్ ను కలిసిన 'సమ్మోహన౦' టీం..

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 01:30 PM

మెగాస్టార్ ను కలిసిన 'సమ్మోహన౦' టీం..

హైదరాబాద్, జూన్ 18 : హీరోల ఇమేజ్ ను కాకుండా కథ బలమే పునాదిగా సినిమాలు తీసే దర్శకులు అరుదు. అలాంటి వారిలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఒకరు. అతను తీసే ప్రతి సినిమా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ఈసారి 'సమ్మోహన' పరిచే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్‌ బాబు, అదితిరావు హైదరీ హీరో హీరోయిన్‌గా తెరకెక్కించిన సినిమా 'సమ్మోహనం' చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూ మంచి టాక్‌ అందుకుంది. అయితే ఈ సినిమాలో సుధీర్‌ బాబు గీసిన బొమ్మలతో ఈ పుస్తకాన్ని హీరోయిన్‌ అదితీరావ్‌ రిలీజ్‌ చేస్తారు.

అలాగే ఇప్పుడీ 'తారలు దిగి వచ్చిన వేళ..' పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రిలీజ్‌ చేయించారు చిత్రబృందం. అంతకు ముందే ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్‌ చేయించింది చిత్ర యూనిట్. అందుకుగాను ఆయనకు థ్యాంక్స్‌ చెప్పటానికి అక్కడకు వెళ్ళారు. ఈ సందర్భంగా 'తారలు దిగి వచ్చిన వేళ..' బుక్‌ ను రిలీజ్‌ చేశారు చిరంజీవి. "'సమ్మోహనం' చిత్రం గుర్తుగా ఈ పుస్తకాన్ని మార్కెట్‌లో రిలీజ్‌ చేస్తే బావుంటుందని భావించాం. ముఖ్యంగా ఈ కథల పుస్తకాన్ని పిల్లలు బాగా ఎంజాయ్‌ చేస్తారని అనుకుంటున్నాం" అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది.





Untitled Document
Advertisements