మహేష్ రెగ్యులర్ షూటింగ్ షురూ..

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 01:58 PM

మహేష్ రెగ్యులర్ షూటింగ్ షురూ..

హైదరాబాద్, జూన్ 18 : సూపర్ స్టార్ మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ తన 25వ సినిమాలో ఓ కొత్త గెటప్ లో దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో అందరు ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో ప్లాన్ చేసినట్టుగా చిత్ర యూనిట్ కొన్ని రోజులక్రితమే వెల్లడించారు.

నేటి నుండి అక్కడ రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. మొదట కాలేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. యూ.ఎస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. కాగా మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. దిల్ రాజు.. అశ్వనీదత్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు.





Untitled Document
Advertisements