హైదరాబాద్, జూన్ 18 : గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక కాస్తంత గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ ప్రస్తుతం ఒక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన 'ఏబీసీడీ' సినిమాకి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సంజీవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్.. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో కాసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
హీరో, హీరోయిన్లపై నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. నిర్మాత సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిత్రం ద్వారా మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెన్త్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారబోతున్నాడు.